● ‘అమ్మ ఆదర్శ’ పనుల్లో కాస్త మెరుగు ● ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభంలోపు పూర్తయ్యేనా..! | - | Sakshi
Sakshi News home page

● ‘అమ్మ ఆదర్శ’ పనుల్లో కాస్త మెరుగు ● ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభంలోపు పూర్తయ్యేనా..!

May 29 2025 1:09 AM | Updated on May 29 2025 9:45 AM

● ‘అమ

● ‘అమ్మ ఆదర్శ’ పనుల్లో కాస్త మెరుగు ● ప్రభుత్వ పాఠశాలల

మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిలిచిపోయిన ‘మన ఊరు–మనబడి’ డైనింగ్‌ హాల్‌ పనులు

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం గత ఏడాది అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేసింది. 733 కమిటీలు ఏర్పాటు కాగా.. 532 పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు నవీకరణ, చిన్నపాటి మరమ్మతులకు రూ.18.96కోట్లు కేటాయించింది. కొన్ని చోట్ల పనులు వేగవంతం కాగా.. మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. బడులు పునః ప్రారంభంలోపు పూర్తి చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది. ఇంకా 274 పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు అవసరమని గుర్తించారు. ఇందులో కొన్ని ‘మన ఊరు–మన బడి’ పనుల కింద చేపట్టగా వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల కిచెన్‌ షెడ్లు లేకపోవడంతో చెట్ల కింద, వరండాలో మధ్యాహ్నం వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 165 పాఠశాలల్లో ప్రహరీలు లేకపోవడం, చిన్న చిన్న మరమ్మతు చేపట్టాల్సి ఉంది. 33 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

‘మన ఊరు–మన బడి’

జిల్లాలో 2022లో గత ప్రభుత్వం అమలు చేసిన ‘మన ఊరు–మన బడి’ పనులు అటకెక్కాయి. మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. నిధులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడతలో 245 పాఠశాలల్లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్‌, మరమ్మతులు, కిచెన్‌షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం చేపట్టారు. 69 అదనపు గదులు మంజూరు కాగా 63 పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 9పౌండేషన్‌ వరకు, 10 బేస్‌మెంటు, 16రూప్‌లెవల్‌ స్థాయిలో నిలిచిపోయాయి. 180 పాఠశాలల్లో మరుగుదొడ్ల పనులు చేపట్టగా.. 92చోట్ల పనులు పూర్తి కాగా, ఎనిమిది చోట్ల చివరి దశలో ఉన్నాయి. 66పాఠశాలల్లో పనులు సాగుతుండగా.. 14చోట్ల పనులు ప్రారంభం కాలేదు.

భోజనశాలలూ అంతే..

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం చేపట్టింది. పాఠశాలల్లో విద్యార్థులు వరండా, ఆవరణలోని చెట్ల కింద కూర్చుని మధ్యాహ్న భోజనం చేసేవారు. ‘మన ఊరు–మన బడి’ కింద ఎంపికై న పాఠశాలల్లో విద్యార్థులు సామూహికంగా కూర్చుని మధ్యాహ్న భోజనం చేయడానికి వీలుగా అన్ని వసతులతో కూడిన డైనింగ్‌ హాళ్ల నిర్మాణం చేపట్టగా చివరి దశలో నిలిచిపోయాయి. రూ.12లక్షల నుంచి రూ. 13లక్షలకు పైగా వెచ్చించారు. జిల్లాలో 60 పాఠశాలలకు గాను 20చోట్ల పనులు పూర్తి కాగా ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తే అందుబాటులోకి వస్తాయి. ఇందులో కొన్ని రూఫ్‌, బేస్‌ మెంట్‌, పౌండేషన్‌ లెవల్‌కు పరిమితం అ య్యాయి. నిధులు సకాలంలో విడుదల కాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అ మ్మ ఆదర్శ పనుల కింద మన ఊరు–మన బడి కింద చేపట్టిన పాఠశాలలను ఎంపిక చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.

● ‘అమ్మ ఆదర్శ’ పనుల్లో కాస్త మెరుగు ● ప్రభుత్వ పాఠశాలల 1
1/1

● ‘అమ్మ ఆదర్శ’ పనుల్లో కాస్త మెరుగు ● ప్రభుత్వ పాఠశాలల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement