
శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల విషయంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండంలోని కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీ(అడ్మి న్), ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో నేర స మీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సి న ముందస్తు చర్యలపై చర్చించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కేసులను త్వరిగతిన పరిష్కరించాలని సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతికమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అదనపు డీసీపీ(అడ్మిన్) సి.రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, అధికారులు పాల్గొన్నారు.