శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

May 30 2025 1:52 AM | Updated on May 30 2025 1:52 AM

శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. రామగుండంలోని కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం ఆయన కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీ(అడ్మి న్‌), ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో నేర స మీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సి న ముందస్తు చర్యలపై చర్చించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరిగతిన పరిష్కరించాలని సూచించారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా శాంతికమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, అదనపు డీసీపీ(అడ్మిన్‌) సి.రాజు, స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, మంచిర్యాల ఏసీపీ ఆర్‌.ప్రకాశ్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement