
మళ్లీ టోల్ వసూళ్లు షురూ
● అటవీ అధికారుల అత్యుత్సాహం ● జాతీయ రహదారిపై అటవీ టోల్గేట్
కోటపల్లి: మండలంలోని పార్పల్లి సమీపంలో జాతీయ రహదారి–63పై ఫారెస్టు టోల్గేట్ వసూళ్లకు అటవీ అధికారులు మళ్లీ తెర తీశారు. హరిత ట్యాక్స్ పేరిట టోల్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఇ టీవల కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. టోల్ వసూలుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఇతర రాష్ట్రాలు, జాతీయ రహదారిపై ప్రయాణించే స్థానికేతరుల నుంచే టోల్ వసూలు చేస్తున్నామని సిబ్బంది చెబు తున్నా అక్కడి వాస్తవ పరిస్థితుల అలా లేవు. చెక్పోస్టు సిబ్బంది తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అన్ని వాహనాలూ టోల్స్కాన ర్ నుంచి వెళ్లి చార్జీలు పడేలా ఏర్పాట్లు చేశారు. స్థా నికులా, స్థానికేతరులా అనేది తెలుసుకోవడం లే దు. టోల్ వసూలును ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వి వేక్వెంకటస్వామి, అటవీశాఖ జిల్లా అధికారి శివ్ ఆశిష్సింగ్ ప్రారంభించారు. ఈ టోల్ చెక్పోస్టు మీ దుగా మహారాష్ట్ర, కాళేశ్వరానికి రెండు వైపుల ని త్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఆటోకు రూ.30, కారు రూ.50, భారీ వాహనాలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. టోల్చెక్పోస్టు మీ దుగా నిత్యం వందలాది వాహనాలు వస్తుంటాయి. వేగంగా వస్తున్న వాహనాలను ఆపేందుకు అటు డ్రైవర్లు ఇటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఎవరు బాధ్యులు, కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని సిబ్బంది ఆందోళ న చెందుతున్నారు. టోల్ వసూలుపై చెన్నూర్ ఎఫ్ డీవో సర్వేశ్వర్ను సంప్రదించగా.. స్థానికుల వాహనాల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, రెండ్రోజుల్లో పూర్తి అందుబాటులోకి వస్తుందని, స్థానికుల నుంచి చార్జీల వసూలు ఉండదని తెలిపారు.
లోకల్ అని చెప్పినా వసూల్ చేసిర్రు..
నేను నిత్యం అవసరాల నిమిత్తం గ్రామం నుంచి చెన్నూర్కు వెళ్తుంటాను. ఫారెస్టు చెక్పోస్టు గుండా వెళ్తుండగా తాత్కాలిక సిబ్బంది అడ్డుకుని టోల్గేట్ స్కానర్ వైపు ఉన్నదారి వెంట వెళ్లాలని సూచించారు. మాది లోకల్ వాహనం అని తెలిపినా పట్టించుకోకుండా రూ.50 ఛార్జీ విధించారు. ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ కొద్దిసేపటికి తిరిగి ఇచ్చారు.
– పల్లె సాయి, ఆలుగామ గ్రామస్తుడు