పులిని హతమార్చిన ఘటనలో 30 మంది రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పులిని హతమార్చిన ఘటనలో 30 మంది రిమాండ్‌

May 24 2025 12:06 AM | Updated on May 24 2025 12:06 AM

పులిని హతమార్చిన ఘటనలో 30 మంది రిమాండ్‌

పులిని హతమార్చిన ఘటనలో 30 మంది రిమాండ్‌

పెంచికల్‌పేట్‌/దహెగాం: పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ అటవీ ప్రాంతంలో ఈ నెల 15న వేటగాళ్లు విద్యుత్‌ తీగలు అమర్చి పెద్దపులిని హతమార్చిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై అటవీ శాఖ ప్రత్యేక బృందాలు వారం రోజులుగా నిందితులను గుర్తించేందుకు విచారణ చేపట్టాయి. ఈ ఘటనలో పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాలకు చెందిన 30 మంది పాల్గొన్నట్లు నిర్ధారించారు. శుక్రవారం సిర్పూర్‌(టి) కోర్టులో దహెగాం, పెంచికల్‌పేట్‌ మండలాలకు చెందిన 30 మందిని హాజరుపర్చగా.. నిందితులకు 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement