రాజారంలో ఉపసర్పంచే సర్పంచ్‌! | - | Sakshi
Sakshi News home page

రాజారంలో ఉపసర్పంచే సర్పంచ్‌!

Dec 15 2025 10:09 AM | Updated on Dec 15 2025 10:09 AM

రాజారంలో ఉపసర్పంచే సర్పంచ్‌!

రాజారంలో ఉపసర్పంచే సర్పంచ్‌!

వేమనపల్లి: మండలంలోని రాజారంలో ఉపసర్పంచ్‌గా ఎన్నికై నవారికే సర్పంచ్‌ గౌరవం దక్కనుంది. 320 ఓటర్లున్న ఈ పంచాయతీని ఎస్సీలకు కేటాయించారు. గ్రామంలో ఎస్సీలెవరూ లేనందున సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించలేదు. ఎస్సీలకు కేటాయించిన 1, 2, 3 వార్డుల్లోనూ ఎస్సీలు లేనందున వీటికీ ఎన్నిక జరగలేదు. మిగతా 4,5,6 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ బలపరిచిన నాలుగో వార్డు అభ్యర్థి కొద్దని శంకరమ్మ గెలుపొందింది. 5, 6 వార్డులకు బీఆర్‌ఎస్‌ బలపరిచిన ఎనగంటి మల్లీశ్వరి, గాదర్ల బీరయ్య విజయం సాధించారు. వీరిలో ఎనగంటి మల్లీశ్వరి ఉపసర్పంచ్‌గా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌ ఎన్నిక లేనందున ఇక్కడ ఉపసర్పంచ్‌కే ఇన్‌చార్జి బాధ్యతలు, చెక్‌ పవర్‌ అప్పగించి పాలక వర్గాన్ని కొనసాగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement