ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు | - | Sakshi
Sakshi News home page

ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు

May 2 2025 1:23 AM | Updated on May 2 2025 1:23 AM

ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు

ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌(జైనథ్‌): ఇసుక రాయల్టీ తీసుకున్న పెండల్‌వాడ, సాంగ్వి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్‌ సీఐ సాయినాథ్‌ తెలిపారు. గురువారం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గతనెల 13న భోరజ్‌ మండలం పెండల్‌వాడ గ్రామ శివారులో పెన్‌గంగా నది నుంచి ఇసుక తీసుకోవడానికి ట్రాక్టర్‌ డ్రైవర్‌ వచ్చాడు. వీడీసీ సభ్యులు భూమారెడ్డి, అతని సోదరుడు రామ్‌రెడ్డితోపాటు మరికొంత మంది సభ్యులు అతని వద్ద రూ.500 రాయల్టీ అక్రమంగా తీసుకున్నారు. దీంతోపాటు ఆయనతో దుర్భాషలాడి బెదిరించారు. సాంగ్వి గ్రామంలో ఇసుక తరలింపులో వసూళ్లకు పాల్పడుతున్న అశోక్‌, మరికొందరిపై ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో జైనథ్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement