క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు

Apr 21 2025 12:55 AM | Updated on Apr 21 2025 12:55 AM

క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు

క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదు

రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి

ఆదిలాబాద్‌: క్రీడా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, తెలంగాణ క్రీడా పాఠశాలను ఆదివారం ఆయన పరిశీలించారు. స్టేడియంలోని సౌకర్యాలు, క్రీడ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను గురించి డీవైఎస్‌వోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పోర్ట్స్‌ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని డీఎస్‌ఏ అధికారులను ఆదేశించారు. క్రీడా పాఠశాలలోని విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు. హాస్టల్‌, జిమ్‌ను పరిశీలించి, మరిన్ని సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విన్నవిస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షకుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఏ అధికారులు, యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి, జైనథ్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ విలాస్‌ పటేల్‌, యువజన కాంగ్రెస్‌ బేల మండల అధ్యక్షుడు గోడే అవినాష్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ బేల అధ్యక్షుడు ఘన్‌శ్యామ్‌, మాజీ సర్పంచ్‌ రూప్‌ రావు, రమేశ్‌ పటేల్‌, ఠాక్రే సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement