ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి

Apr 21 2025 12:55 AM | Updated on Apr 21 2025 12:55 AM

ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి

ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి

● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

ఉట్నూర్‌రూరల్‌: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్‌ కేబీ కాంప్లెక్స్‌లోని వైటీసీలో గిరిజన నిరుద్యోగులకు ఆర్టీసీ ఆదిలాబాద్‌ రీజియన్‌ సహకారంతో హెవీ వెహికిల్‌ మోటార్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 59 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 4 వేల అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. యువత ఖాళీగా ఉండకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం దేవుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బెంచీలు అందజేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్సీ విఠల్‌, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement