సీనియర్ నెట్బాల్ పోటీల్లో ప్రతిభ
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ పురుష, మహిళల నెట్బాల్ చాంపియన్షిప్లో మహబూబ్నగర్ జిల్లా జట్లు ప్రతిభచాటాయి. 4వ ఫాస్ట్–5 విభాగంలో మహబూబ్నగర్ పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ట్రెడిషనల్ విభాగంలో మహబూబ్నగర్ పురుషుల జట్టు నల్లగొండ జట్టుతో కలిసి మూడోస్థానంలో, ట్రెడిషనల్ విభాగంలో మహబూబ్నగర్ మహిళల జట్టు రన్నరప్గా, మొదటి సీనియర్ మిక్స్డ్ విభాగంలో మహబూనగర్ జట్టు రన్నరప్గా నిలిచాయి. ప్రతిభచాటిన జిల్లా జట్లను సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విక్రం ఆదిత్యరెడ్డి, కార్యదర్శి సయ్యద్ అంజద్అలీ, కోచ్ అబ్దుల్ షరీఫ్
అభినందించారు. – మహబూబ్నగర్ క్రీడలు


