
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నిలకడగా కొనసాగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 1,02,950 క్యూసెక్కులు ఉండగా.. గురువారం రాత్రి 8.30 ప్రాంతంలో 92 వేల క్యూసెక్కుల తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 8 క్రస్ట్గేట్లను ఎత్తి 55,928 క్యూసెక్కులు, విద్యుదుద్పత్తికి 40,324, ఆవిరి రూపంలో 70, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 670, భీమా లిఫ్ట్కు 750 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.651 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
586.515 మి.యూ. విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో గురువారం ఉత్పత్తి వేగవంతంగా కొనసాగిందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 279.387 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 307.128 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని, ఇప్పటి వరకు 586.515 మి.యూ. విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.
సుంకేసులకు కొనసాగుతున్న వరద..
సుంకేసుల జలాశయానికి గురువారం ఎగువ నుంచి 73 వేల క్యూసెక్కుల వరద రాగా.. 17 గేట్లను మీటర్ మేర తెరిచి 70,312 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర వివరించారు. అలాగే 2,626 క్యూసెక్కులు కేసీ కెనాల్కు సరఫరా చేసినట్లు తెలిపారు.
8 క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల