పీయూలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

పీయూలో ఏం జరుగుతోంది?

Jul 23 2025 5:54 AM | Updated on Jul 23 2025 5:54 AM

పీయూల

పీయూలో ఏం జరుగుతోంది?

ఈసారి జెడ్పీపీఠం

కై వసం చేసుకోవాలి

స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి

పాలమూరు: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక 42 శాతం బీసీ రిజర్వేషన్‌ అంశం ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అప్పుడు ఎందుకు 42 శాతం కల్పించలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఈ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. బూత్‌ స్థాయిలో విజయం సాధిస్తే రాబోయో ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, 18 నెలలు గడిచినా ఇప్పటికీ వాటిని అమలుచేయలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. జిల్లాలో 16 మండలాల్లో 8 మహిళలకు రిజర్వ్‌ అవుతాయని, 16 జెడ్పీటీసీ స్థానాలు గెలుపొంది జెడ్పీ పీఠం దక్కించుకోవాలన్నారు. జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు, 3,367 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. ఈ నెల 26న జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, పద్మజారెడ్డి, వీర బ్రహ్మచారి, సుదర్శన్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు, ప్రశాంత్‌రెడ్డి, అంజయ్య, సాహితీరెడ్డి పాల్గొన్నారు.

నాన్‌ టీచింగ్‌ సిబ్బందిపై వేధింపుల పర్వం

ఇటీవల పలువురిపై సస్పెన్షన్‌ వేటు

చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు

వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు

టీచింగ్‌ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్‌ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్‌టీచింగ్‌ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్‌టీచింగ్‌ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్‌లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు.

ఏం మాట్లాడితే ఏం చేస్తారో..

మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న పీయూ పీజీ కళాశాల ఓ మహిళా నాన్‌టీచింగ్‌ సిబ్బంది తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తుండగా.. రిజిస్ట్రార్‌ అడ్డుకుని సదరు మహిళను సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్‌ తీరుతో నాన్‌టీచింగ్‌ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎలాంటి విచారణ, హెచ్చరిక, నోటీస్‌ లేకుండా సస్పెన్షన్‌ వేటు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఓ టీచింగ్‌, ఓ నాన్‌టీచింగ్‌ గొడవపడిన వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన అధికారులు నేరుగా నెల రోజుల పాటు సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేశారన్న ఆరోపణలతో వారిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీలు వేశారు. దీంతో ఏం మాట్లాడితే.. ఏం చేస్తారోనన్న భయాందోళన నాన్‌ టీచింగ్‌ సిబ్బందిలో నెలకొంది.

టీచింగ్‌ సిబ్బందిలోనూ అసంతృప్తి..

పీయూలో ప్రొఫెసర్‌ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్‌ టీచింగ్‌ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

● ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడిని చీఫ్‌ వార్డెన్‌గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్‌కు గతంలో ఉన్న చీఫ్‌ వార్డెన్‌ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్‌లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.

బదిలీల పరంపర..

నాన్‌టీచింగ్‌లో రెగ్యులర్‌ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్‌ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్‌టీచింగ్‌ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్‌ చాన్స్‌లర్‌ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్‌లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

పీయూలో ఏం జరుగుతోంది? 1
1/1

పీయూలో ఏం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement