స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ కసరత్తు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ కసరత్తు

Jul 8 2025 7:01 AM | Updated on Jul 8 2025 7:01 AM

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ కసరత్తు

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ కసరత్తు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌గా పార్టీ సీనియర్‌ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్‌ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ కీలకపాత్ర పోషించనున్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు..

రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్‌చార్జ్‌లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.సంపత్‌కుమార్‌ నల్లగొండ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జీగా నియమితులయ్యారు.

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌గా జె.కుసుమకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement