
‘ఉమామహేశ్వరం’లో ఆన్లైన్ సేవలు
●
విరాళాలు ఇవ్వొచ్చు..
ఉమామహేశ్వర దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం భక్తులు వస్తుంటారు. కానుకలు, విరాళాలు ఆన్లైన్లో ఇవ్వొచ్చు. విదేశాలలో ఉన్న భక్తులు కూడా ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుంది.
– శ్రీనివాసరావు, ఈఓ
ఎమ్మెల్యే కృషితోనే..
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల మాదిరిగా ఉమామహేశ్వరంలోనూ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ కృషితోనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది.
– బీరం మాధవరెడ్డి, చైర్మన్, ఆలయ కమిటీ
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సేవలను భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయాల్లో నిర్వహించే ముఖ్యమైన సేవలను భక్తులు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు ఆన్లైన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆలయాల్లో భక్తుల రద్దీ, క్యూలైన్లను తగ్గించేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టింది. గతంలో ఆలయాల్లో అభిషేకాలు, ఆర్జిత సేవలు, అన్నదానం, వసతి సౌకర్యం కోసం ఆలయాలకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండేది. ఇక నుంచి ఆలయాల్లోని సేవలన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు భక్తులకు వీలు కల్పించింది.
ఉమామహేశ్వరంలోనూ అందుబాటులోకి..
శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర దేవాలయంలో శివుడిని దర్శించుకోవడానికి, ప్రకృతి రమణీయ ప్రదేశాన్ని చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోనూ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయశాఖ నుంచి అనుమతి రావడంతో సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ఆన్లైన్ సేవలను ప్రారంభించారు.
ప్రముఖ ఆలయాల మాదిరిగానే..
ముందస్తు బుకింగ్తో భక్తులకు ప్రయోజనం
ప్రారంభించిన
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

‘ఉమామహేశ్వరం’లో ఆన్లైన్ సేవలు

‘ఉమామహేశ్వరం’లో ఆన్లైన్ సేవలు

‘ఉమామహేశ్వరం’లో ఆన్లైన్ సేవలు