ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

Mar 21 2023 1:58 AM | Updated on Mar 21 2023 1:58 AM

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రవినాయక్‌  - Sakshi

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రవినాయక్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ‘ప్రజావాణి’కి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్ద ని కలెక్టర్‌ రవినాయక్‌ అన్నారు. కార్యక్రమంలో భా గంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ను తిప్పుకోకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ అనిల్‌కుమార్‌, డీఆర్‌డీఓ యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు దినోత్సవాన్ని రద్దు చేశారు. దీంతో ఈ వారం ప్రజలు పెద్దసంఖ్యలో తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చారు. అయితే ఉదయం 10 గంటల నుంచే ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు రాగా.. కలెక్టర్‌ రాకపోవడంతో ఎదురుచూపులు తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement