ప్రలోభాల హోరు
న్యూస్రీల్
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పంపకాల జోరు..
● రేపు తుది విడత ‘పంచాయతీ’ ..
● జిల్లాలో 150 జీపీల్లో ఎన్నికల పోలింగ్
● ముగిసిన ప్రచారం..
అంతుబట్టని ఓటరు నాడి
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. జిల్లాలో మూడో విడతలో కురవి, సీరోలు, మరిపెడ, డోర్నకల్, కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోని 150 గ్రామ పంచాయతీల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి, మలి విడతల్లో కొన్నిచోట్ల పోటాపోటీగా తలపడినా... మరికొన్ని చోట్ల అనైతిక పొత్తులతో ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుని ‘హస్తం’హవాను చాటారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా, బీజేపీ, రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. కాగా మూడో విడత ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని స్థానాలు దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ముగిసిన ప్రచారం.. జోరుగా పంపకాలు...
ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్కు ఒక్కరోజు గడువే ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బుతోపాటు గిఫ్ట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గ్రామాల్లో పోలింగ్కు ముందురోజు ఇంటికి కిలో చికెన్, మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేస్తున్నట్లు వైరల్ అవుతోంది.
150 పంచాయతీలకు..
మూడో దశలో మొత్తం 169 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ మద్దతుదారులు 14, బీఆర్ఎస్ 01, సీపీఐ(ఎంఎల్) 01, ఇతరులు 03 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఆయా మండలకేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఉదయమే రిపోర్ట్ చేయాలని, తదనంతరం పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రలోభాల హోరు
ప్రలోభాల హోరు
ప్రలోభాల హోరు
ప్రలోభాల హోరు


