తేలిన లెక్క.. | - | Sakshi
Sakshi News home page

తేలిన లెక్క..

Dec 5 2025 2:04 PM | Updated on Dec 5 2025 2:04 PM

తేలిన లెక్క..

తేలిన లెక్క..

మహబూబాబాద్‌: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. కాగా, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈనెల 4వ తేదీన అధికారులు వెల్లడించారు. కాగా 155 సర్పంచ్‌ స్థానాలకు గానూ 9 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్‌ స్థానాలకు 468 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,338 వార్డుల్లో 266 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,072 వార్డులకు 2,391 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

9జీపీలు,

266 వార్డులు

ఏకగ్రీవం..

జిల్లాలోని ఐదు మండలాల్లో తొలివిడత జీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా ఐదు మండలాల్లోని 155 జీపీలకు 9గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. గూడూరు మండలంలో ఒక గ్రామ పంచాయతీ, ఇనుగుర్తి 2, కేసముద్రం 3, మానుకోట 2, నెల్లికుదురు మండలంలో ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. అలాగే గూడూరు మండలంలో 36వార్డులు, ఇనుగుర్తి 30, కేసముద్రం 60, మానుకోట 76, నెల్లికుదురు మండలంలో 64 వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఈనెల 11వ తేదీ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు.

మొదటి విడతలో 155 జీపీల్లో

9జీపీలు ఏకగ్రీవం

1,338 వార్డులకు 266 ఏకగ్రీవం

మిగిలిన 146 సర్పంచ్‌స్థానాల

బరిలో 468మంది అభ్యర్థులు

1,072 వార్డుల్లో 2,391మంది పోటీ

ఈనెల 11న పోలింగ్‌

బరిలో నిలిచిన వార్డు అభ్యర్థులు

మండలం వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు

గూడూరు 318 730

ఇనుగుర్తి 82 167

కేసముద్రం 194 442

మానుకోట 262 578

నెల్లికుదురు 216 474

మొత్తం 1,072 2,391

మండలం జీపీలు బరిలో ఉన్న

అభ్యర్థులు

గూడూరు 40 120

ఇనుగుర్తి 11 34

కేసముద్రం 26 82

మానుకోట 39 129

నెల్లికుదురు 30 103

మొత్తం 146 468

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement