విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి

Aug 8 2025 9:17 AM | Updated on Aug 8 2025 9:19 AM

నెల్లికుదురు: నిత్యం పరిసరాలను గమనిస్తూ ఒక్కసారిగా వచ్చే మెరుపు వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదం లాంటి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కమాండర్‌ భూపేంద్ర కుమార్‌ సూచించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు, మదనతుర్తి, మునిగలవీడు, రావిరాల, రాజులకొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి గురువారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విపత్తులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బృందం వివరించింది. కాగా, గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు రావిరాలలో కొట్టుకుపోయిన రోడ్డును విపత్తు బృందం, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో విపత్తు బృంద సభ్యులు మురళీరాథోడ్‌, మోహన్‌రావు, మండల ప్రత్యేకాధికారి జినుగు మరియన్న, తహసీల్దార్‌ చందానరేశ్‌, ఎంపీఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌

భూపేంద్ర కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement