కంబాలపల్లి పాఠశాలకు అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

కంబాలపల్లి పాఠశాలకు అరుదైన అవకాశం

Jul 12 2025 9:53 AM | Updated on Jul 12 2025 9:53 AM

కంబాలపల్లి పాఠశాలకు అరుదైన అవకాశం

కంబాలపల్లి పాఠశాలకు అరుదైన అవకాశం

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు అరుదైన అవకాశం దక్కింది. ఐఐటీ మద్రాస్‌ స్కూల్‌ కనెక్ట్‌ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఎంపికై ంది. ఈ ఏడాది మహబూబాబాద్‌ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న పాఠశాలలు మొత్తం ఐదు కాగా, కంబాలపల్లి పాఠశాల వాటిలో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ఆధునిక రంగాల్లో విద్యను అందించడంతోపాటు భవిష్యత్‌లో తగిన కెరీర్‌ ఎంపిక చేసుకునే అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు 8 వారాలపాటు 10 ఆన్‌లైన్‌ కోర్సులు చదివే అవకాశం కలుగుతుంది. ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్‌, ఇతర ప్రముఖ విద్యాసంస్థల నిపుణులు రూపొందించారు.

ప్రధాన అంశాలు

● కోర్సుల వ్యవధి : 8 వారాలు (ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభం)

● పరిశీలన : ప్రతి కోర్సుకు రూ.500 మాత్రమే రుసుం

● సర్టిఫికెట్‌ : కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఇ–సర్టిఫికెట్‌ లభిస్తుంది

మరింత సమాచారం

● విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు నమోదు చేసుకోవాలి

● కోర్సు అనంతరం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ జారీ చేస్తారు

● పాఠశాల తరఫున బాధ్యత వహించే విధంగా పాఠశాల (గణితం) సహాయ ఉపాధ్యాయులు కాసం శ్రీనివాసరావు ఎస్పీఓసీ (సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌)గా నియమితులయ్యారు

కోర్సుల వివరాలు

● డేటా సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిచయం

● ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ పరిచయం

● ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌ పరిచయం

● ఇంజినీరింగ్‌ బయాలాజికల్‌ సిస్టమ్స్‌ పరిచయం

● ఫన్‌ విత్‌ మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌

● లా పరిచయం

● మ్యాథ్స్‌ గేమ్స్‌ అండ్‌ పజిల్స్‌

● ఏరోస్పేస్‌ ఫండమెంటల్స్‌ వంటి మొదలైన అంశాలపై శిక్షణ

ఐఐటీ మద్రాస్‌ స్కూల్‌

కనెక్ట్‌ ప్రోగ్రాంలో భాగస్వామ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement