
మామిడికాయలు కోస్తుండగా విద్యుత్ షాక్..
దుగ్గొండి: పచ్చడి మామిడి కాయలు కోస్తూ విద్యుదాఘాతానికి గురై జూనియర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన అంకేశ్వరపు చంద్రమౌళి(40) గతంలో వీఆర్ఓగా పనిచేశాడు. ప్రస్తుతం కుడా పరిధిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న తన బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా స్వగ్రామం దేశాయిపల్లికి వచ్చాడు. తిరిగి విధులు నిర్వర్తించే ప్రాంతానికి వెళ్లేముందు ఓ కర్రకు చివరన ఇనుప కొడవలి కట్టి తమ ఇంటి ఆవరణలోని మామిడి కాయలు కోస్తున్నాడు. ఈక్రమంలో చెట్టుపై నుంచి ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు కొడవలి తగిలింది. కర్ర పచ్చిగా ఉండడంతో విద్యుత్షాక్ తగిలి కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం వరంగల్కు తరలిస్తుండగా మృతి చెందాడు. చంద్రమౌళికి భార్య దేవేంద్ర, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి అంకేశ్వరపు సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
● కుడా జూనియర్ అసిస్టెంట్ మృతి
● దేశాయిపల్లిలో విషాదఛాయలు