
బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
అనంతపురం: అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో అటెండర్ రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధిక వడ్డీలకు అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని సీ క్యాంప్కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా అనంతపురంలో ఉంటూ సెంట్రల్ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లాడు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పాడు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ అటెండర్ భార్యకు ఫోన్ చేసి రవికుమార్ బాత్రూంలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడని పిలిస్తే పలకడం లేదని వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టి చూడగా అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకుని రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడ ంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు దీక్షిత, వీక్షిత ఉన్నారు.
హరిత క్షమించు..
రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే.. ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి ఉపయోగం లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసిన అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక.. వడ్డీలు కట్టేందుకు మళ్లీ చేసిన అప్పులు ఒకదానికి ఒకటి తోడయ్యాయి. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. గుజ్జల రాముడు అనే వ్యక్తి వద్ద రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటివరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరిత పిల్లలు జాగ్రత్త అని రాశాడు.
అధిక వడ్డీలకు అప్పులు
తీర్చలేక అఘాయిత్యం