మత సామరస్యంతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యంతో మెలగాలి

Apr 28 2025 1:09 AM | Updated on Apr 28 2025 1:09 AM

మత సామరస్యంతో మెలగాలి

మత సామరస్యంతో మెలగాలి

కర్నూలు కల్చరల్‌: ప్రజలు మత సామరస్యంతో మెలగాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్‌ సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ విశ్రాంత సర్కిల్‌ అఽధికారి, మిమిక్రీ ఆర్టిస్ట్‌ ఖాదర్‌బాబు అభినందన సభ, మిమిక్రీ నాటక ప్రదర్శన, సంగీత విభావరి కార్యక్రమాలు ఆదివారం సీక్యాంప్‌ టీజీవీ కళాక్షేత్రంలో జరిగాయి. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. ఖాదర్‌ బాబు నాటక రంగంలో మల్టీటాలెంటెడ్‌గా రాణించడం అభినందనీయమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తిఓబులయ్య, ఆర్‌ఆర్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ బాలమద్దయ్య, విశ్రాంత ఎస్పీ లక్ష్మీనాయక్‌ మాట్లాడారు. అనంతరం ఖాదర్‌బాబు ప్రదర్శించిన నాటక సన్నివేశాలు, గాయకులు సుధారాణి, హబీబ్‌, బాల వెంకటేశ్వర్లు నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. కళాక్షేత్రం మాజీ అధ్యక్షుడు దస్తగిరి, కార్యదర్శి మహమ్మద్‌ మియ్యా, సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement