
క్లస్టర్ టీచర్లతో మేలు
క్లస్టర్ టీచర్లతో బోధనా కార్యక్రమాలు ప్రభావవంతంగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో క్లస్టర్ టీచర్లలో ఒక్కరైనా ఖాళీగా ఉండటం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లినప్పుడు, క్లస్టర్ టీచర్లను వెంటనే ఆ స్కూళ్లకు పంపిస్తున్నాం. పిల్లల చదువుకు అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులన్నీ భర్తీ చేసి, మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇతర జిల్లాల్లో అవసరమైన చోటకు పంపించే ఏర్పాట్లు చేస్తాం.
– రామారావు,
కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి