
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్రూరల్: ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్య ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరే ట్ కార్యాలయంలో సార్వత్రిక విద్యాపీఠం స మన్వయకర్తలు అశోక్, మధు, జిల్లా పరీక్షల నిర్వహణాధికారి ఉదయ్బాబుతో కలిసి ఓపె న్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసినవారు ఓపెన్ విద్యావిధానాన్ని సద్వి నియో గం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 20 సెంటర్లున్నాయని తెలిపారు. అసక్తిగలవారు ఈ నెల 31వరకు మీ సేవలో దరఖాస్తు చేసుకుని అడ్మిషన్లు పొందాలని సూచించారు.