
సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని యువజన క్రీడాశాఖ అధికారి, డీటీడీవో రమాదేవి అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ సమీపంలోని మోడల్ స్కూల్లో నెట్బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పది క్రీడాంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ పరిధిలో శిబిరానికి వెళ్లి క్రీడలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, శిక్షకుడు తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.