పిల్లలను బడిలో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను బడిలో చేర్పించాలి

May 31 2025 1:16 AM | Updated on May 31 2025 1:16 AM

పిల్లలను బడిలో చేర్పించాలి

పిల్లలను బడిలో చేర్పించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాలలో శుక్రవారం హెచ్‌ఎం, పీఎంఆర్పీలు, ఏటీడీవోలతో సమావేశం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ జూన్‌ 6 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయలు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. డ్రాపౌట్లను మళ్లీ స్కూళ్లలో చేర్పించాలని సూచించారు. సమావేశంలో ఏసీఎంవో ఉద్దవ్‌, జీసీడీవో శకుంత ల, ఏటీడీవోలు చిరంజీవి, డీఎస్‌వో మీనా రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement