అడెల్లు.. అమర్‌రహే! | - | Sakshi
Sakshi News home page

అడెల్లు.. అమర్‌రహే!

Jun 7 2025 12:14 AM | Updated on Jun 7 2025 12:14 AM

అడెల్

అడెల్లు.. అమర్‌రహే!

● ముగిసిన ఉద్యమ ప్రస్థానం ● బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి ● మూడు దశాబ్దాలుగా అరణ్యంలోనే.. ● విషాదంలో పొచ్చెర గ్రామం ● మృతదేహం అప్పగించాలంటున్న కుటుంబీకులు, గ్రామస్తులు

బోథ్‌: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాల ఉద్యమ కెరటం నింగికెగిసింది. నూనుగు మీసాల ప్రాయంలో అడవిబాట పట్టి విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. మావోయిస్టు రా ష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల డివిజన్‌ ఇన్‌చార్జి మైలారపు అడెల్లు అ లియాస్‌ భాస్కర్‌ (53) ప్రస్థానం ముగిసింది. ఛత్తీ స్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అ టవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అడెల్లు మృతి చెందాడు. ఉదయం నుంచి మావో యిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో తుదిశ్వాస విడిచాడు. బాల్యం నుంచి అభ్యుద య భావాలున్న అడెల్లు మరణవార్త ఆదిలాబాద్‌ జి ల్లాలోని పొచ్చెర గ్రామాన్ని తీవ్రంగా కలిచివేసింది.

అడెల్లు ప్రస్థానం ఇదీ..

అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పొచ్చెర గ్రామం. తల్లిదండ్రులు పోతన్న–పోషవ్వకు నలుగురు సంతానం. పెద్ద అడెల్లు, సీతా రాం, అడెల్లు, చిన్న అడెల్లు. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. దున్నే వాడిదే భూమి నినా దం, పేదరికం అడెల్లును నక్సలిజం వైపు నడిపించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను 1989లో జరిగిన భూపోరాటం ఆకర్షించింది. అడె ల్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరులతో కలిసి కూలీ పనులకు వెళ్తుండేవాడు. భూస్వాముల పెత్తందారీతనాన్ని తరచూ ప్రశ్నించేవాడు.

విద్యాభ్యాసం..

బోథ్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. 1989లో నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. నిర్మల్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరాడు.

రాడికల్‌ నుంచి దళంలోకి..

రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. అధ్యక్షుడిగా పనిచేశాడు. గ్రామాల్లో తిరుగు తూ ప్రజలను చైతన్యపరిచాడు. ఈ క్రమంలోనే 1995 ప్రాంతంలో నక్సలైటుగా మారాడు. దళంలో కి ప్రవేశించాడు. మొదట బోథ్‌ దళ సభ్యుడిగా పని చేసిన ఆయన ఇంద్రవెల్లి డిప్యూటీ కమాండర్‌ స్థా యికి ఎదిగాడు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై పూ ర్తిస్థాయి పట్టు సాధించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల డివిజ న్‌ కమిటీకి సారథ్యం వహిస్తూ.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో రిక్రూట్‌మెంట్‌ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. గతంలో అడెల్లు దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీస్‌ బలగాలు ఉమ్మడి జిల్లాలోని తిర్యాణి, మంగి, బోథ్‌, పెంబి, ఖానాపూర్‌, మామడ ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు వినికిడి. 2020 సెప్టెంబర్‌ 19న కదంబ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అడెల్లుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది.

కంతి లింగవ్వతో వివాహం..

అడెల్లు దళంలో చేరిన సందర్భంలోనే అప్పటికే అందులో కొనసాగుతున్న నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్‌ గ్రామానికి చెందిన కంతి లింగవ్వతో వివాహమైంది. ఈ క్రమంలో ఇద్దరు కీలక సభ్యులుగా ఎదిగారు. లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలి గా ప్రధాన భూమిక పోషించారు. మంగీ ప్రాంతంలో రిక్రూట్‌మెంట్‌ చేసినట్లు తెలుస్తోంది. 2022 డి సెంబర్‌లో లింగవ్వ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. అప్పటి నుంచి అడెల్లు చత్తీస్‌గఢ్‌ డీకే వెళ్లారని తెలుస్తోంది.

ఎట్లున్నడో అనుకునేలోపే చేదు వార్త

కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయాలని వారికి పట్టున్న అడవుల్లో కూంబింగ్‌ షురూ చేసింది. ఎన్‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన తరుణంలో అడెల్లు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త వారి గుండెను చెరువు చేసింది. చివరి చూపు కోసం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు.

అడెల్లు.. అమర్‌రహే!1
1/1

అడెల్లు.. అమర్‌రహే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement