ప్రొటోకాల్‌ పాటించరా? | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ పాటించరా?

Jun 7 2025 12:14 AM | Updated on Jun 7 2025 12:14 AM

ప్రొటోకాల్‌ పాటించరా?

ప్రొటోకాల్‌ పాటించరా?

సాక్షి, ఆసిఫాబాద్‌: ‘ఆసిపాబాద్‌ నియోజకవర్గానికి ప్రథమ పౌరురాలిని. నా పట్ల జిల్లా కనీస గౌరవ మర్యాదలు పాటించడం లేదు. నన్ను పిలవకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నాయకులను ప్రభుత్వ కార్యక్రమాల కు ఆహ్వానిస్తున్నారు. గురువారం నాకు కనీస స మాచారం ఇవ్వకుండా రెబ్బెన మండలం ఇంద్రానగర్‌ పుంజిమరిగూడ హేబిటేషన్‌లో డీసీసీ అధ్యక్షు డు కొక్కిరాల విశ్వప్రసాద్‌ ఇందిరమ్మ ఇళ్ల మంజూ రు పత్రాలు లబ్ధిదారులకు అందించారు. రెబ్బెన ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారు? అలాగే తిర్యాణి మండలంలోనూ ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు అధికారులు పాల్పడ్డారు. అనిల్‌గౌడ్‌ అనే వ్యక్తితో భూమిపూజ చేయించారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డ రెబ్బెన, తిర్యాణి ఎంపీడీవోలు, హౌసింగ్‌ ఏఈ, పంచాయతీ కార్యదర్శులను తక్షణమే సస్పెండ్‌ చేయాలి.’ అంటూ ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు.

కంగుతిన్న పోలీసులు

శుక్రవారం ఉదయం 11.45 గంటలకు తన బీఆర్‌స్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకుపోయి బైఠాయించారు. ఊహించని పరిణామంతో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీ సులు కంగుతిన్నారు. పదుల సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు రావడంతో అడ్డుకోవడం వారి వల్ల కా లేదు. చివరకు కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే ఎమ్మెల్యే బైఠాయించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

తక్షణమే సస్పెండ్‌ చేయాలి

ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులను త క్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి నిరసనకు దిగడంతో కలెక్టరేట్‌లో కొ ద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ వచ్చి సమాధానం చెప్పాలంటూ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. దాదాపు 4.25 గంటలపాటు కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణం నాయకుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఎమ్మెల్యే నిరసనకు దిగారన్న సమాచారంతో జైనూర్‌ మండల పర్యటనలో ఉన్న ఆర్డీ వో లోకేశ్వరరావు తొలుత కలెక్టరేట్‌కు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఆమె డిమాండ్లను సావధానంగా విని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఉన్నతాధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే అందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేయించారు. అ నంతరం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ వచ్చేదాకా కదిలేది లేదని భీష్మించడంతో మధ్యాహ్నం తరువాత అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) డేవిడ్‌ వచ్చి ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందిర మ్మ ఇళ్ల అర్హుల జాబితా ఇప్పిస్తే వెళ్తానని మొండికేయడంతో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశాలతో హౌసింగ్‌ డీఈ అర్హుల జాబితా ఎమ్మెల్యేకు అందించడంతో ఆమె శాంతించారు.

ఆఫీసర్లపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్‌

పార్టీ శ్రేణులతో కలెక్టరేట్‌ ముట్టడి

ఉల్లంఘనుల సస్పెన్షన్‌కు డిమాండ్‌

లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రతిచర్యలుంటాయ్‌..

అదనపు కలెక్టర్‌ డేవిడ్‌కు వినతిపత్రం ఇచ్చా క ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించకపోతే బీఆర్‌ఎస్‌ శ్రేణుల నుంచి ప్రతిచర్యలుంటాయని హెచ్చరించారు. ప్రొటోకాల్‌ లేని అధికారపార్టీ నాయకులను ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించరాదని సూచించారు. రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల ముగ్గులు, భూమిపూజ కార్యక్రమాలు తామే చేపడతామని, అధికారపార్టీ నాయకులు అ డ్డుకునే ప్రయత్నం చేస్తే వారి బొక్కలు విరగ్గొడతామని హెచ్చరించారు.

అధికారులంతా ప్రొటోకాల్‌ పాటించేలా ఉత్తర్వులు ఇ వ్వాలని ఎమ్మెల్యే అదనపు కలెక్టర్‌కు సూచించారు. వారంలోపు ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డ వారిపై కచ్చితంగా చర్యలుంటాయని అదన పు కలెక్టర్‌ డేవిడ్‌ ఎమ్మెల్యేకు హామీ ఇవ్వడంతో ఆమె నిరసన కార్యక్రమాన్ని విరమించారు. బీఆర్‌ఎస్‌కు చెంది న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement