కొనుగోళ్లలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో వేగం పెంచాలి

Jun 7 2025 12:14 AM | Updated on Jun 7 2025 12:14 AM

కొనుగోళ్లలో వేగం పెంచాలి

కొనుగోళ్లలో వేగం పెంచాలి

రెబ్బెన: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డేవిడ్‌ ఆదేశించారు. మండలంలోని ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తేమశాతం తక్కువున్నా ధా న్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కొండపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పా టు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హా జరై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు. ప్రతీ సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ స దస్సుల ద్వారా భూసమస్యలు త్వరగా పరి ష్కరించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఆయన వెంట తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఏవో దిలీప్‌కుమార్‌, ఆర్‌ఐ సౌమ్య, ఏఈవో రాకేశ్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement