రోస్టర్‌ విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోస్టర్‌ విధానం అమలు చేయాలి

Jun 8 2025 12:36 AM | Updated on Jun 8 2025 12:36 AM

రోస్టర్‌ విధానం అమలు చేయాలి

రోస్టర్‌ విధానం అమలు చేయాలి

శ్రీరాంపూర్‌: సింగరేణిలో పని చేస్తున్న ఎస్టీ ఉద్యోగులకు ఖాళీల భర్తీ, పదోన్నతుల కోసం రోస్టర్‌ విధానం అమలు చేయాలని సింగరేణి ఎస్టీ చీఫ్‌ లైజన్‌ అధికారి కృష్ణయ్య తెలిపారు. రోస్టర్‌ వెరిఫికేషన్‌ కార్పొరేట్‌ కమిటీ శ్రీరాంపూర్‌ ఏరియాలో శనివారం పర్యటించింది. జీ ఎం కార్యాలయంలో జీఎం ఎం శ్రీనివాస్‌ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. రోస్టర్‌ రిజి స్టర్‌ను పగడ్బందీగా నమోదు చే యాలని సూ చించారు. కొన్ని పాయింట్స్‌కి సంబంధించి స లహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డీ జీఎం(పర్సనల్‌) అరవిందరావు, కమిటీ అధ్యక్షుడు భాస్కర్‌రావు, జనరల్‌ సెక్రెటరీ నాగేశ్వర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పంతుల, ఏరియా ఎస్టీ లైజన్‌ అధికారి గుండేరావు, ఉపాధ్యక్షుడు మోహన్‌, నాయకులు హుస్సేన్‌నాయక్‌, రాజు నాయక్‌, డీవైపీఎం రాజేశ్వర్‌రావుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement