
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అందరి బాధ్యత
రెబ్బెన: వినియోగదారులకు నాణ్యమైన బొ గ్గును అందించడం సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. శనివారం ఏరియా లోని కై రిగూడ ఓసీపీలో బొగ్గు నాణ్యతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించినప్పుడే సంస్థకు గుర్తింపు వస్తుందన్నారు. గనుల్లో నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడంలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లది కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి శంకర్, ప్రాజె క్టు ఇంజనీరు వీరన్న, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, సేఫ్టీ అధికారి రజనీ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.