
టైగర్జోన్ పేరుతో ఖాళీ చేయించే కుట్ర
ఆసిఫాబాద్రూరల్: టైగర్జోన్ పేరుతో గ్రా మాలను ఖాళీ చేయించే కుట్రలను ప్రజ లు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ గ్రామాలను ఫారెస్టు భూములుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కాగజ్నగర్ ప్రాంతాన్ని టైగర్జోన్గా ప్రకటించడం అన్యాయమన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న, నాయకులు దినకర్, శ్రీనివాస్, ఆనంద్, కార్తీక్, టీకానంద్, సాయి, తదితరులు పాల్గొన్నారు.