మానవత్వంతో వ్యవహరించాలి● | - | Sakshi
Sakshi News home page

మానవత్వంతో వ్యవహరించాలి●

Jun 7 2025 12:14 AM | Updated on Jun 7 2025 12:14 AM

మానవత్వంతో వ్యవహరించాలి●

మానవత్వంతో వ్యవహరించాలి●

బెజ్జూర్‌: అటవీశాఖ అధికారులు ప్రజలతో మానవత్వంతో వ్యవహరించాలని, కేసులు పెడతామని బెదిరిస్తూ అణిచివేయొద్దని బీఆ ర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీ ణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెంటనే స్పందించి అటవీ అధికారులు రైతులను వేధించకుండా ఆదేశించాలని డిమాండ్‌ చేశా రు. సిర్పూర్‌ నియోజకవర్గంలో గంజాయి స రఫరా పెరిగిందని, యువత అప్రమత్తంగా ఉండి మహమ్మారిని ఇంట్లోకి రాకుండా జాగ్ర త్త వహించాలని కోరారు. ఇటీవల బెజ్జూర్‌ ఎస్సైపై దాడికి యత్నించిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప అనుచరులను చట్ట ప్రకారం శిక్షించా లని డిమాండ్‌ చేశారు. మర్తిడికి శివారులో చి న్నక్కకు చెందిన భూమిని అక్రమంగా పట్టా చేసుకుని మాజీ ఎమ్మెల్యే అండతో విక్రయించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. బెజ్జూర్‌ మండల కన్వీనర్‌ సారయ్య, యూత్‌ అధ్యక్షుడు కాశి పాక రాజు, నాయకులు హరి, వరలక్ష్మి, కమల, శంకర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement