
కేంద్ర మంత్రులను కలిసిన ‘పాల్వాయి’
బెజ్జూర్(సిర్పూర్): సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను వారి అధికారిక నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర నిధుల విడుదల, మౌలిక వసతుల విస్తరణ, రోడ్డు, రైల్వే, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డి, అధికార ప్రతినిధులు రాణి రుద్రమ, సోలంకి శ్రీనివాస్ ఉన్నారు.