
కరాటే శిక్షణలో ప్రతిభ
కాగజ్నగర్టౌన్: డ్రాగన్ కుంఫు ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కాగజ్నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్, జిల్లా డ్రాగన్ కుంఫు క్లబ్ ప్రధాన కార్యదర్శి చాపిడి కుమార్ తెలిపారు. పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి మైదానంలో గురువారం నిర్వహించిన పోటీల్లో రఘువర్షన్, సువర్ణలత, అద్విత, సాయిసంకీర్తనలు ఆరెంజ్ బెల్టు సాధించారని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు కర్ణాటకలో జరుగనున్న గిన్నీస్ రికార్డు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.