
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
కౌటాల: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. గురువారం మండలంలోని పార్డీ గ్రామంలో నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సును ఆయన సందర్శించి దరఖాస్తుల ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించుకునే అ వకాశం ఉందన్నారు. రైతులు రెవెన్యూ సదస్సుల్లో తమ భూ సమస్యలపై వివరంగా దరఖాస్తులు స మర్పించాలని, రికార్డులను సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను కేటగిరీల వారీగా రిజిస్టర్లలో నమోదు చేసి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన..
కౌటాల మండలం సాండ్గాంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పిస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు. జాప్యం లేకుండా వరి ధాన్యం తూకం వేయాలని సిబ్బందికి సూచించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ప్రమోద్, సహకార శాఖ జిల్లా అధికారి బిక్కు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సును పరిశీలించిన సబ్కలెక్టర్
సిర్పూర్(టి): తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా మండలంలోని చింతకుంట గ్రామంలో తహసీల్దార్ రహీముద్దిన్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. గురువారం కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధాశుక్లా రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డేవిడ్

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి