‘పది’పై ప్రణాళికేది? | - | Sakshi
Sakshi News home page

‘పది’పై ప్రణాళికేది?

May 2 2025 1:15 AM | Updated on May 2 2025 1:15 AM

‘పది’

‘పది’పై ప్రణాళికేది?

● ఏటా దిగజారుతున్న ఫలితాలు ● వెనుకబడిపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు నయం ● విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి దృష్టి సారిస్తే మేలు

ఆసిఫాబాద్‌రూరల్‌: పదో తరగతి పరీక్షలపై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడంతో ఫలితాలు మరోసారి నిరాశ పరిచాయి. నాలుగేళ్లుగా రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం విద్యాశాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. 2021– 22 విద్యా సంవత్సరంలో జిల్లా 32వ స్థానంలో నిలవగా, మరుసటి ఏడాది కొంత మెరుగుపడి 30వ స్థానంలో నిలిచింది. గతేడాది 31వ స్థా నంలో నిలవగా, 2024– 25 విద్యా సంవత్సరంలో మళ్లీ 32వ స్థానానికి పడిపోయింది. జీవితంలో కీలకమైన పదో తరగతిలో ఫెయిల్‌ కావడంతో చాలా మంది విద్యార్థులు అక్కడితోనే ఆగిపోతున్నారు. మారుమూల పల్లెల్లో ఉత్తీర్ణత సాధించని ఆడపిల్ల లకు తల్లిదండ్రులు బాల్యవివాహాలు జరిపిస్తుండగా, బాలురు వ్యవసాయ, కూలీ పనులకు వెళ్తున్నా రు. ‘విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం’ అంటూ అధికారులు చెబుతున్న మాటలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు.

ఫలితాలు ఇలా..

జిల్లావ్యాపంగా మొత్తం 157 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మూడు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 39 మంది 26 మంది(66 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 37 గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల్లో 1,182 మందికి 1090(92 శాతం), 15 కస్తూ రిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 496 మందికి 468 మంది(94 శాతం), 50 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో(లోకల్‌బాడీ) 2,129 మందికి 1,659 మంది(78 శాతం), ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 277 మందికి 169మంది(61శాతం), రెండు మోడల్‌ స్కూళ్లలో 166 మందికి 157 మంది(95 శాతం), నాలుగు బీసీ వెల్ఫేర్‌ స్కూళ్లలో 275 మందికి 272 మంది(99 శాతం), మూడు మైనార్టీ గురుకులాల్లో 145 మందికి 131 మంది(92 శాతం), ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 230 మందికి 226 మంది(98 శాతం), మూడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 496 మందికి 484 మంది(97 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లతో పోల్చితే ప్రభుత్వ, లోకల్‌బాడీ పాఠశాలల్లోనే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 41 ప్రైవేట్‌ సూళ్లు ఉండగా, 1066 మందికి 972 మంది పాసయ్యారు.

తగ్గిన పర్యవేక్షణ..

కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్‌ విద్యాధికారిని నియమించడం లేదు. మంచిర్యాల డీఈవో యాదయ్య ప్రస్తుతం జిల్లా విద్యాధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్‌ అధికారి లేకపోవడంతో విద్యాశాఖపై పర్యవేక్షణ తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. ఉపాధ్యాయులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకాకపోవడంతో వారికి విషయ పరిజ్ఞానం పెరగడం లేదు. ఈ కారణంతోనే వసతి, గురుకులాల్లోని విద్యార్థుల మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. పదో తరగతి విద్యార్థులకు జనవరి నుంచి కాకుండా ఆగస్టు నుంచి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి బోధి స్తే ఉపయోగం ఉంటుంది. 2025– 26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు సమష్టి కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

దృష్టి సారిస్తాం

జిల్లాలో తక్కు వ ఉత్తీర్ణత శాతం నమో దు చేసిన పాఠశాలలపై ప్ర త్యేక దృష్టి సారిస్తాం. వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కువ మంది పదో తరగతి విద్యార్థులు గణితం, సైన్స్‌ సబ్జెక్టులోనే ఫెయిల్‌ అయ్యారు. గతేడాదితో పోల్చితే నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగినా జిల్లా 32వ స్థానంలో నిలిచింది.

– యాదయ్య, ఇన్‌చార్జి డీఈవో

ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌లోనే..

పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి చతుర్విద ప్రక్రియలపై పట్టు సాధిస్తేనే లెక్కలు సులువుగా చేయవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే చతుర్విద ప్రక్రియలు, భాషా నైపుణ్యాలు పెంచడంపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

‘పది’పై ప్రణాళికేది?1
1/1

‘పది’పై ప్రణాళికేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement