
బొగ్గు గనులపై ఘనంగా కార్మిక దినోత్సవం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, ఇతర డిపార్టుమెంట్లలో గురువారం 139వ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకొన్నారు. కైరిగూడ ఓసీపీతోపాటు గోలేటి సీహెచ్పీ, ఏరియా స్టోర్స్, వర్క్షాప్, గోలేటి టౌన్షిప్లోని కేఎల్ మహేంద్రభవన్, తెలంగాణ భవన్ల వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మిక అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గోలేటి బస్టాండ్, రెబ్బెన మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాల యం, భవన్ నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయాల వద్ద ఎర్రజెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షు డు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, శేషు, కిరణ్బాబు, టీబీజీకేఎస్ ఏరి యా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.