
ఆదివాసీ వంటలకు డిమాండ్
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ● ఉట్నూర్లో ఇప్పపువ్వు పండుగ కార్యక్రమం
ఉట్నూర్రూరల్: ఆదివాసీ సాంప్రదాయ వంటలకు ఎంతో డిమాండ్ ఉందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో 8వ ఇప్పపువ్వు పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్లు పాల్గొన్నారు. మహిళలు ఇప్పపువ్వులతో తయారు చేసిన వంటకాలు ప్రదర్శించారు. ఆదివాసీ మహిళలు ఆదివాసీ పద్దతులు, సాంప్రదాయ వంటకాలపై అధికారులకు వివరించి తినిపించారు. అధికారులు మాట్లాడుతూ ఇప్పపువ్వు లడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. ఈ లడ్డూలు ఉట్నూర్ ఎక్స్రోడ్డులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 12 మంది గిరిజన మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వుల లడ్డూలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, దుర్గు పటేల్, సహకార మిత్ర సంస్థ మేనేజర్ విఠల్, పేసా కోఆర్డినేటర్ వసంత్రావు, రాయి సెంటర్ల్ల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.