
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించి సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి అందాల నడుమ ఉత్సాహంగా గడిపారు.
599 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.33,145 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.22,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.