
టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రాగమయి
● ఉమ్మడి జిల్లా నుంచి
మరికొందరికి కూడా స్థానం
సత్తుపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లా నాయకులు పలువురికి స్థానం దక్కింది. ఈమేరకు 27మంది ఉపాధ్యక్షులు, 69మంది ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ నుంచి సోమవారం జాబితా విడుదలైంది. ఇందులో ప్రధాన కార్యదర్శులుగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సహా పలువురికి చోటు కల్పించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన మద్దినేని బేబీ స్వర్ణకుమారి, నాగా సీతారాములు, కట్ల రంగారావు జాబితాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అత్రనేత రాహుల్గాంధీ, కే.సీ.వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు, మంత్రులు పొంగులేటీ శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అప్రమత్తతే కీలకం
ఖమ్మం రాపర్తినగర్: వరదల వంటి ప్రకృతి విపత్తుల సమయాన అప్రమత్తంగా ఉంటేనే ప్రమాద తీవ్రత తగ్గుతుందని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ కే.ఆర్.గౌతమ్ తెలిపారు. గత ఏడాది మున్నేటి వరదతో నష్టం ఎదురుకాగా ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. యువజన సంఘాలకు ఏర్పాటుచేసిన ఈ సదస్సులో గౌతమ్ మాట్లాడుతూ వరదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరద ముంచెత్తినా సురక్షితంగా బయటపడడం, వరదల్లో మునిగిన వారికి ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడగా ఏఎస్సై మద్దిలేటి, ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగులు జగదీష్, ఉదయ్కుమార్తో పాటు గౌస్, ఉమాశంకర్, సునీల్, రాము పాల్గొన్నారు.
బడుల బలోపేతం, నాణ్యమైన విద్య
ఖమ్మం అర్బన్: బడి ఈడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని, తద్వారా పాఠశాలలు బలోపేతం కావడమే కాక విద్యార్థులకు నాణ్య మైన ఉచిత విద్య అందుతుందని ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం 55వ డివిజన్ వేణుగోపాలనగర్లో సోమవారం నిర్వహించిన బడిబాట ర్యాలీ, సమావేశంలో కార్పొరేటర్ శ్రావణిసుధాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు తోడు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన భోజనం అందుతున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలికా సంరక్షణ కమిటీ చైర్పర్సన్ భారతిరాణి, ఏఏపీసీ చైర్పర్సన్ గోపికుమారి, ఎన్నెస్పీ హైస్కూల్ హెచ్ఎం గుడిపూడి శ్రీని వాసరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లుతో పాటు పి.వెంకటేశ్వర్లు, జ్యోతి, సత్యవతి, వెంకటలక్ష్మి, కుమార్, ప్రసాద్, రమేష్, పుల్లారావు, నవీన్ పాల్గొన్నారు.
ప్రవేశాల సంఖ్య
మరింత పెరగాలి
వైరా: పదో తరగతి తర్వాత విద్యార్థులెవరూ చదువు మానేయకుండా చూస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు సూచించారు. వైరా జూనియర్ కళాశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన అధ్యాపకులతో సమావేశమయ్యారు. ప్రతీ అధ్యాపకుడు ఓ ప్రభుత్వ పాఠశాలకు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల తల్లిదండ్రులను కలవాలని తెలిపారు. తద్వారా కాలేజీల్లో ప్రవేశాలు పెంచ డమే కాక మెరుగైన బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. కాగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించేలా అధికారులతో చర్చిస్తున్నామని డీఐఈఓ తెలిపారు. ప్రిన్సి పాల్ నవీనజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
30వరకు బియ్యం పంపిణీ
నేలకొండపల్లి: రేషన్షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడం, కార్డుదా రుల నుంచి ఆరేసి సార్లు వేలిముద్రలు వేయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీనెల 15వ తేదీ వరకు బియ్యం ఇస్తుండగా, ఈసారి 30వ తేదీ వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం అందరికీ తెలిసేలా దుకాణాల వద్ధ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని డీలర్లను డీసీఎస్ఓ ఆదేశించారు.

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రాగమయి