చకచకా ఆధునికీకరణ | - | Sakshi
Sakshi News home page

చకచకా ఆధునికీకరణ

Jun 10 2025 3:24 AM | Updated on Jun 10 2025 3:42 AM

● వైరా రిజర్వాయర్‌కు గైడ్‌ వాల్స్‌, ఇతర నిర్మాణాలు ● సాగు సీజన్‌కల్లా మేజర్‌పనులు పూర్తి ● జూలై నుంచి సాగునీటి విడుదలకు ప్రణాళిక

వైరా: జిల్లాలో పెద్దదైన వైరా రిజర్వాయర్‌ రెండో దశ ఆధునికీకరణ పనులను వేగంగా చేపడుతున్నారు. ఏళ్ల తర్వాత గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.42.10 కోట్లు మంజూరు చేసింది. దీంతో రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించిన నీటి పారుదల శాఖ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎండాకాలంలో ఎక్కువ మేర పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించడమే కాక ఈ సీజన్‌లో సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. మళ్లీ అన్‌ సీజన్‌లో పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు.

ఏయే పనులు...

రిజర్వాయర్‌ ఆధునికీకరణ రెండో దశ పనులు ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. ప్రధానంగా ఎడమ కాల్వ పరిధిలో ఆరు కి.మీ. మేర గైడ్‌ వాల్స్‌, మరో ఆరు కి.మీ. మేర లైనింగ్‌ పనులు చేడుతున్నారు. ఇక రెండు వైపులా సీసీ లైనింగ్‌ పనులు చేయిస్తున్నారు. అలాగే, కొండకొడిమ నుంచి గొల్లపూడి వరకు 2.75 కిలో.మీ. గైడ్‌వాల్‌ నిర్మాణం పూర్తయింది. ఇక కుడి కాల్వ పరిధిలో కోస్తాల నుంచి కొండకొడిమ వరకు ఈనెలాఖరు వరకు గైడ్‌వాల్‌ పూర్తిచేయనున్నారు. తాటిపూడి నుంచి జింకలగూడెం వరకు మూడు కి.మీ. పనులు పూర్తయ్యాయి. కాగా, గైడ్‌వాల్స్‌తో పాటు కాలువలో సిమెంట్‌ బెడ్‌ నిర్మాణం పూర్తిచేసినా లైనింగ్‌ పనులు మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి.

రెండేళ్ల గడువు

వైరా రిజర్వాయర్‌ ఎడమ కాల్వ పరిధి లింగన్నపేట, విప్పలమడక గ్రామాల మధ్య సీసీ బెడ్‌ నిర్మాణం పూర్తయింది. మొత్తంగా పనుల్లో 70 శాతం ఈనెలాఖరు నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. కానీ లైనింగ్‌ పనులు మాత్రం అన్నిచోట్ల ఆలస్యమయ్యే అవకాశముంది. చాలా ప్రాంతాల్లో కాలువలు బలహీనంగా ఉండడం, నల్లరేగడి నేల కావడంతో ఇలా జరుగుతోందని చెబుతున్నారు. అయితే, 2027 జనవరి వరకు పనులు పూర్తి చేయాలనే ఒప్పందం ఉండగా, వాతావరణం సహకరిస్తే 2026 ఏప్రిల్‌ నాటికే పనులు పూర్తి చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీజన్‌లో నీరు విడదల చేస్తూనే, అన్‌ సీజన్‌లో పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.

ఏళ్ల తరబడి ఎదురుచూపులు..

రిజర్వాయర్‌ ఆధునికీకరణకు మొదటిసారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.55కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కుడి, ఎడమ కాల్వలకు గైడ్‌ వాల్స్‌, లైనింగ్‌, అదనపు అలుగు వంటి పనులు చేపట్టారు. ఏళ్ల తర్వాత రెండో దశ పనులకు రూ.42.10కోట్లు మంజూరు చేయడంతో ఇప్పటికే 70శాతానికి పనులు చేరువయ్యాయి. ఈ పనులన్నీ పూర్తయితే రిజర్వాయర్‌ చివరి భూములకు కూడా విడుదల చేసిన మొదటి రోజే కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది.

వాతావరణ ం సహకరిస్తే త్వరలోనే..

రిజర్వాయర్‌ రెండో దశ ఆధునికీకరణ పనులు ఆశించిన దాని కంటే వేగంగా సాగుతున్నాయి. మధ్యలో వర్షాలు కురవడంతో కొంత జాప్యం జరిగింది. ఆతర్వాత మళ్లీ ఊపందుకున్నాయి. 70శాతం మేర పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసి జూలైలో సాగునీరు విడుదల చేయాలని భావిస్తున్నారు.

– శ్రీనివాస్‌, డీఈ, నీటిపారుదల శాఖ

చకచకా ఆధునికీకరణ1
1/2

చకచకా ఆధునికీకరణ

చకచకా ఆధునికీకరణ2
2/2

చకచకా ఆధునికీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement