
భూభారతితో సమస్యలకు పరిష్కారం
కామేపల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందనివ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలం పొన్నేకల్లో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాసు పుస్తకాలు అందక అనేక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ అధికారంకి రాగానే భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టడంతో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అనంతరం ముచ్చర్ల శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన ఆయన, గరిడేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, నాయకులు దొడ్డ వేణు, బోడా రాజేశ్నాయక్, వల్లభనేని అశోక్, మాలోత్ ప్రేమ్కుమార్, దేవండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.