
రాజీవ్ యువ విలాపం!
● యువ వికాసం పథకం అమలులో జాప్యం ● ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకులు ● ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు 1.60 లక్షలు ● కేటాయించిన మొత్తం యూనిట్లు 38,230
చుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మే నెలలోగా లబ్ధి దారులను ఎంపిక చేసి ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని భావించింది. అనంతరం ఈ నెల 5న మంత్రివర్గ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో యువతీయవకులు నిరాశ చెందుతున్నారు. దరఖాస్తులు వెల్లువలా రావడం, దరఖాస్తుల పరిశీలన ఓ కొలిక్కి రాకపోవడంతో అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
సబ్సిడీ ఇలా..
పథకంలో రూ.50వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందించనుంది. ఈ నాలుగు కేటగిరీల్లో రూ. 50వేలు, రూ.లక్ష యూనిట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
‘సిబిల్’కే బ్యాంకర్ల ప్రాధాన్యం..
యువ వికాసం దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించారు. తొలుత మండల కమిటీల ఆమోదం తర్వాత జిల్లా కమిటీలకు జాబితా చేరుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఈ పథకం మంజూరు చేస్తా రు. గతంలో ఏదైనా కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందారా?, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్నారా? అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు సిబిల్ స్కోర్ను పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించినా బ్యాంకర్లు మాత్రం దాటికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి జిల్లాలో 38,230 యూనిట్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి 1,60,207 మంది యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు 38,230 యూ నిట్లను పంపిణీ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఖమ్మంజిల్లాకు 20,181యూనిట్లు, భద్రాది జిల్లాకు 18,049 యూనిట్లు కేటాయించింది. మొదటి విడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2లో రూ. లక్ష వరకు ఎంపికై న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఈనెల 15లోపు శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. అయితే అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం జాబితాలో స్థానం కల్పిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈనెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా యువ వికాసంపై ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో పథకం అమలు మరింత జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఆదేశాలు రావాల్సి ఉంది
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఈ నెల 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం.
–బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ,
Æ>iÐŒæ Ķæ¬Ð]l ÑM>çÜ… MøBÇz¯ólrÆŠḥ, ¿¶ {§é{¨ hÌêÏ
అర్హుల ఎంపికలో పొరపొట్లు..
రాష్ట్రఆవిర్భావం దినోత్సవం రోజు పథకాన్ని ప్రా రంభించాలని భావించినా పెద్ద సంఖ్యలో దరఖా స్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సాయం అందించాలని ప్రభుత్వం భావించి కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎప్పుటికప్పుడు వాయిదా పడుతుండటంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. కాగా పథకం అమలుకు మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన తేదీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో కార్పొరేషన్ల వారీగా
వచ్చిన దరఖాస్తులు
కార్పొరేషన్ ఖమ్మం భద్రాద్రి
బీసీ 39,616 20,602
ఎస్సీ 29,742 12,488
ఎస్టీ 14,416 27,792
మైనారిటీ 7,412 2,844
ఈబీసీ 4,022 1,049
క్రిస్టియన్ 117 107

రాజీవ్ యువ విలాపం!