
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి కరామత్ అలీ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరావు, టీపీటీఎఫ్ జిల్లా అద్యక్షుడు నాగేశ్వరావు, పీఆర్టీయూ జిల్లా అద్యక్షుడు వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన ఖమ్మంలో సోమవరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే ఫీజులు, ఇతరత్రా పేర్లతో రూ.కోట్లలో దండుకున్నాయని ఆరోపించారు. జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండగా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇకనైనా ఫీజుల నియంత్రణ, అనుమతుల విషయమై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో నాయకులు సింగు నర్సింహరావు, ఎన్.రామకృష్ణ, ప్రవీణ్, సుధాకర్, వెంకటేశ్, లక్ష్మణ్, మస్తాన్, సుఽరేష్, లతాదేవి, పోటు కళావతి, బేగం తదితరులు పాల్గొన్నారు.