కిన్నెరసానిలో ఆహ్లాదం | - | Sakshi
Sakshi News home page

కిన్నెరసానిలో ఆహ్లాదం

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

కిన్నెరసానిలో ఆహ్లాదం

కిన్నెరసానిలో ఆహ్లాదం

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌, జలాశయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 641 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.35,575 ఆదాయం లభించింది. 300 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.15,120 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మహాధర్నాను

విజయవంతం చేయండి..

ఇల్లెందు: సీతారామా ప్రాజెక్టు జలాలు భద్రాద్రి జిల్లా రైతాంగానికి అందించాలని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆరు గ్యారంటీలు, 13 అంశాలు అమలు డిమాండ్‌ చేస్తూ సోమవారం ఇల్లెందులో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షులు దిండిగల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఇల్లెందులోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9వ తేదీన ఉదయం 10 గంటలకు మహా ధర్నా ప్రారంభం అవుతుందని, నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అత్యధికంగా తరలి రావాలని కోరారు. లక్కినేని సురేందర్‌, శీలం రమేష్‌, అజ్మీరా భావ్‌సింగ్‌ నాయక్‌, జేకే శ్రీనివాస్‌, రంగనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement