రేపటి నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు

Jun 8 2025 12:17 AM | Updated on Jun 8 2025 12:20 AM

రేపటి

రేపటి నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు

పత్తి యార్డులో అన్ని పంటలకు ఏర్పాట్లు

ఖమ్మంవ్యవసాయం: ఎండల తీవ్రత నేపథ్యాన నెల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలను నిలిచిపోగా, సోమవారం తిరిగి మొదలుకానున్నాయి. ఎండలు 40–45 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో కార్మికులు, ఖమ్మం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధి వర్గం వినతితో సెలవులు ప్రకటించారు. మే 9న మొదలైన సెలవులు ఆదివారంతో ముగియనుండగా, తిరిగి సోమవారం నుంచి మార్కెట్‌లో కొనుగోలు మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు.

అన్నీ పత్తి యార్డులోనే...

మిర్చి యార్డులో మోడల్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో అన్ని పంటల కొనుగోళ్లు పత్తి యార్డులో చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు మిర్చి, పత్తి, అపరాలకు ప్రత్యేక షెడ్లను కేటాయించారు. ప్రస్తుతం మిర్చి, కొద్ది మేర పత్తి, యాసంగిలో పండిన పెసలు, మొక్కజొన్నలను విక్రయానికి తీసుకొచ్చే అవకాశముంది. అలాగే, మిర్చి ధర పెరిగితే కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటలను రైతులు తీసుకురానున్నారు. వానాకాలం సీజన్‌ పెట్టుబడికి అవసరమైన నగదు కోసం రైతులు ఇళ్లు, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటలను తీసుకొచ్చే అవకాశముండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

నేడు, రేపు ఐసెట్‌

ఖమ్మం సహకారనగర్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఆది, సోమవారాల్లో జరగనుంది. జిల్లాలోని ఐదు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేయగా రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాగా, ఉదయం పరీక్షకు 8నుంచి 9–45గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 2–15గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తారు.

రేపటి నుంచి డీసెట్‌ కౌన్సెలింగ్‌

ఖమ్మం సహకారనగర్‌: బీఈడీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(టీజీడీఈఈ సీఈటీ – డీ సెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ జరగనుంది. ఖమ్మంలోని డైట్‌ కళాశాలలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన కోసం నాలుగు బృందాలను నియమించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని డైట్‌ ప్రిన్సిపాల్‌ సామినేని సత్యనారాయణ సూచించారు.

రేపటి నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు1
1/1

రేపటి నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement