శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ

Jun 8 2025 12:17 AM | Updated on Jun 8 2025 12:20 AM

శ్రీవ

శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శని వారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు తెల్లవారుజామునే స్వామి మూల విరా ట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మ వార్లను పట్టువస్త్రాలతో అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, శ్రీవారికి పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్‌ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.

బొగ్గు నాణ్యత విషయంలో రాజీ పడొద్దు

సత్తుపల్లిరూరల్‌: రక్షణ సూత్రాలు పాటిస్తూనే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్‌ కొప్పుల వెంకటేశ్వర్లు ఆదేశించారు. సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ ప్రాజెక్టు కార్యాలయం పైఅంతస్తులో నిర్మించిన నూతన గదులను శనివారం ఆయన కొత్తగూడెం ఏరియా జీఎం షాలేం రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ప్లాస్టిక్‌ సంచుల వాడకం పూర్తిగా తగ్గించాలని సూచించారు. అనంతరం క్వారీని సందర్శించిన డైరెక్టర్‌ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణపై సమీక్షించారు. వర్షాకాలం నేపథ్యాన ఉత్పత్తికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి పీఓ ప్రహ్లాద్‌, ఇంజనీర్‌ జీ.వీ.రావు, వివిధ విభాగాల అధికారులు రాజేశ్వరరావు, కల్యాణ్‌రామ్‌, నరేష్‌, అభిలాష్‌, గోవింద్‌, రవికుమార్‌, దేవదాస్‌, నాయకులు సుధాకర్‌, నర్సింహారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ
1
1/1

శ్రీవారికి అభిషేకం, పల్లకీసేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement