
ఊడిన టాటా ఏస్ స్టీరింగ్..
ఇల్లెందురూరల్/కారేపల్లి: గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుంచి కారేపల్లి మండలం పోలెంపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనంలో ఒక కుటుంబం గురువారం ఉదయం బయలుదేరింది. మార్గమధ్యలో ఇల్లెందు మండలంలోని రాజీవ్నగర్తండా శివారులో అకస్మాత్తుగా స్టీరింగ్ ఊడిపోవడంతో టాటాఏస్ వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పోలెబోయిన సుభద్ర, దొడ్ల నర్సమ్మ, రమేష్, పోలెబోయిన వెంకటనర్సు, పోలెబోయిన లక్ష్మి, డ్రైవర్ పూనెం కృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన సుభద్ర, నర్సమ్మ, వెంకటనర్సులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫారసు చేశారు. మిగిలిన నలుగురికి ఆస్పత్రిలో వైద్యసాయం అందించారు.
ఆరుగురికి తీవ్ర గాయాలు