
అర్బన్ మలేరియా సిబ్బంది విధుల పరిశీలన
ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని మున్సిపాటిలీ కార్యాలయంలో గల అర్బన్ మలేరియా పథకంలో పనిచేస్తున్న సిబ్బంది విధులను గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఇన్స్పెక్టర్ మహ్మద్ మన్నన్, హెల్త్ అసిస్టెంట్ హరీష్, ఫీల్డ్వర్కర్ రామకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో సిబ్బంది అటెండెన్స్తో పాటు విధులను పరిశీలించారు. అనంతరం రోటరీనగర్, లెనిన్నగర్, సారథినగర్ ప్రాంతాల్లోని మురికి కాల్వల్లో ఆంటీ లార్వ స్ప్రే పనులను పరిశీలించి దోమల నివారణపై పలు సూచనలు చేశారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని, జ్వరం వచ్చిన వెంటనే మలేరియ, డెంగీ పరీక్షలు చేయించాలన్నారు. పాజిటివ్గా నమోదైతే ఆ ఇంటి పరిసరాలలో ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే చేయించి ఇతరులకు సంక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో అందరూ క్షేత్రస్థాయిల్లో ఉండి విధుల్ని నిర్వర్తించాలని, కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.