వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు | - | Sakshi
Sakshi News home page

వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు

Jun 6 2025 6:15 AM | Updated on Jun 6 2025 6:15 AM

వెంకన

వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డితో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ విజయకుమారి వారికి అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ ముల్పూరి శ్రీనివాసరావు, నాయకులు వేమిరెడ్డి త్రివేణి, బాణావత్‌ శ్రీనివాసరావు, వేమిరెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనాన్ని కాపాడాలి

ఖమ్మం లీగల్‌ : భవిష్యత్‌ తరాల కోసం పచ్చదనాన్ని కాపాడడం అందరి బాధ్యత అని న్యాయమూర్తులు ఏపూరి బిందుప్రియ, నాగలక్ష్మి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం వెలుగుమట్ల అర్బన్‌ పార్క్‌లో మొక్కలు నాటి.. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వాచ్‌ టవర్‌, నర్సరీ, బోటింగ్‌ ట్యాంక్‌, యోగా షెడ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. పార్క్‌లో చేపట్టిన పరిశుభ్రత, మొక్కల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

సర్వే వేగవంతం చేయాలి

అదనపు కలెక్టర్‌ శ్రీజ

ఎర్రుపాలెం: భూ భారతిలో పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సర్వే సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ములుగుమాడులో నిర్వహిస్తున్న భూముల రీసర్వే తీరును గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత బనిగండ్లపాడు ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి, వైద్య సేవలు, పరీక్షలపై ఆరా తీశారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అనుమతి లేకుండా గైర్హాజరు కావొద్దని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మెరుగైన వైద్య సేవలందించాలి..

వైరా: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. వైరాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆమె రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు.

వెంకన్న సన్నిధిలో  పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు1
1/2

వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు

వెంకన్న సన్నిధిలో  పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు2
2/2

వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement